Thursday, 1 January 2026

📚 శ్రీకాకుళం జిల్లా – 30 మంది రచయితలు (సంక్షిప్త వివరాలు) వల్లూరు దాలినాయుడు (మురళి) తెలుగు భాష ఉపాధ్యాయులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పొగిరి (రాజాO మండలం) విజయనగరం జిల్లా... సిక్కోలు సాహితీ వనంలో తులసి మొక్కలు ఒకప్పటి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఎందరో సాహితీవేత్తలు అమూల్యమైన కవితా రతనాలను గ్రంథాలను అందించారు. ఆ వారసత్వాన్ని ఈనాటి ఆధునిక కవులు కూడా కొనసాగిస్తున్నారు. అమూల్యమైన ఈ గ్రంథాలు సామాజికము, పౌరాణికము, ఆధ్యాత్మికము, వైద్యరంగము, నిఘంటువులు, కథా రచనలు జ్యోతిష్య శాస్త్ర గ్రంథాలు, నవలలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో కవితా ప్రక్రియలు ఆ మహానుభావుల కలం కదలికల నుండి ఆవిర్భవించి సాహితీ ప్రియుల మన్ననలను అందుకున్నాయి. సిక్కోలు వైభవం పేరుతో విడుదలవుతున్న ఈ పుస్తకంలో అటువంటి మహనీయులను గురించి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఈనేటి తరానికి తెలియాలని ఓ చిన్న ప్రయత్నం ఇది... ఎందరో మహానుభావులు అందరినీ ఇందులో ప్రస్తావించ లేకపోవచ్చు ... అది కాకతాళీయమే కానీ బుద్ధిపూర్వకము కాదని విన్నవించుకుంటూ ఉన్నాను. మనకు అందుబాటులో ఉన్న కొద్దిమంది పేర్లను ఈ వ్యాసంలో అందిస్తున్నాము.. ఇంకెవరినైనా మరిచినట్లయితే మాకు తెలిపితే తదుపరి ముద్రణలో వారిని ఈ పుస్తకంలో ప్రస్తావించడం జరుగుతుందని వినయపూర్వక మనవిచేస్తున్నాను.. 1.గిడుగు రామమూర్తి పంతులు: గిడుగు వెంకట రామమూర్తి (1863 ఆగష్టు 29 - 1940 జనవరి 22 ) తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు . గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది. శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్ధితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు. గిడుగు ఉద్యమం వల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైంది. గిడుగు రామ్మూర్తి జయంతి ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం”గా జరుపుకుంటున్నాము. 2.చాగంటి సోమయాజులు (1915, జనవరి 15 1994 జనవరి 1) ప్రముఖ తెలుగు రచయిత. చాసోగా అందరికీ సుపరిచితుడు. ఆయన మానవతావాదిగా ప్రారంభమై, మార్క్సిస్టుగా మారి, కథల్లో ప్రగతిశీల విలువలు, పీడిత ప్రజల బాధలు, సమస్యలు గురించి విస్తృతంగా రచనలు చేశాడు.ఈయన మొట్ట మొదటి రచన చిన్నాజీ 1942లో భారతి అనే పత్రికలో ప్రచురితమైంది. ఆ తరువాత ఎన్నో కథలు, కవితలు రాశాడు. ఈయన రాసిన చాలా కథలు హిందీ, రష్యన్, కన్నడ, మరాఠి, మలయాళం, ఉర్దూ భాషలలోకి అనువదించబడ్డాయి. 1968లో చాసో కథలుగా పుస్తక రూపంలో చాసో కథా సంకలనం వెలువడింది. 3.గెడ్డాపు సత్యం :ప్రముఖ పద్యకవి, సాహితీవేత్త.ఈయన శ్రీకాకుళం జిల్లా, సంతకవిటి మండలం, కాకరపల్లి గ్రామంలో 1936, ఫిబ్రవరి 3న లక్ష్మమ్మ, ఎర్రంనాయుడు దంపతులకు జన్మించారు. శ్రీకాకుళంలోని డిగ్రీ కళాశాలలో ఆచార్యులుగా పనిచేశారు.వీరు త్రిలిఙ్గపత్రిక, మిసిమి తదితర మాసపత్రికల్లో వ్యాసాలు రాశారు. ఆకాశవాణిలో కవితా స్రవంతి కార్యక్రమంలో స్వీయ కవితలు వినిపించారు. వర్ణనరత్నాకరం అనే పద్య సంకలనాలకు ఆయన వ్యాఖ్యానాలు రాశారు.మృత్యుంజయుడు జైత్రయాత్ర,శివకేశవమ్,ప్రసన్నధర్మము,కవితా వైజయంతి,శ్రీ వేణుగోపబాల శతకము,త్రికుటేశ్వర సుప్రభాతం మొదలైనవి. జనవరి 8, 2015న మరణించారు ________________________________________ 4. పింగళి నాగేంద్రరావు (1901-1971) : ఆజన్మ బ్రహ్మచారి. సినిమా సంభాషణలలో కొత్త హాస్య పదాలు సినిమాలలో కొత్త పాత్రలు సృష్టించి మరెన్నో ప్రయోగాలు చేసి సినీ సాహి త్య స్వరూపాన్ని మార్చివేసిన సినీ సరస్వతీ పుత్రుడు. జానపదమైనా, పౌరాణికమైనా, సాంఘికమైనా జానపదులు సైతం మెచ్చే సరళభాషను ఉపయోగించిన సినీ ఆదికవి. ‘అయ్యో పాపం పసివాడు' పాతాళభైరవి, ‘ఆడు వారి మాటలకు అర్థాలే వేరయా' మిస్సమ్మ ఇందుకు ఉదాహరణలు. పాతాళభైరవి, మా యాబజారు వంటి చిత్రాలలో వినోదం వర్షింప జేసిన ఈయన కలం 'వింధ్యరాణి', 'మహామం త్రితిమ్మరుసు', 'చాణక్య చంద్రగుప్త'లలో ఠీవిగా పరుగిడింది. 5. అడివి బాపిరాజు (1895-1952) ఒక భారతీయ బహుభాషావేత్త , అతను తెలుగు భాషలో నవలా రచయిత, నాటక రచయిత , చిత్రకారుడు, కళా దర్శకుడు మరియు తెలుగు నాటకరంగం మరియు సినిమాల్లో తన రచనలకు ప్రసిద్ధి చెందిన వలసవాద వ్యతిరేక జాతీయవాది . అతను గోన గన్నా రెడ్డి , నారాయణ రావు , మరియు హిమబిందు వంటి సాహిత్య రచనలకు ప్రసిద్ధి చెందాడు . 6. దీర్ఘాసి విజైభాస్కర్: డా. దీర్ఘాసి విజయభాస్కర్ నాటక రచయితగా, కవిగా, కథకుడిగా, అనువాద రచయితగా బహుముఖ ప్రజ్ఞాశాలి. నాటకరంగానికి సంబంధించిన పరిశోధనలో మంచి పేరు సంపాదించిన రచయిత. విజయభాస్కర్ శ్రీకాకుళం జిల్లా అంపోలులో 1958 జులై 31న జన్మించాడు. తండ్రి పేరు సూర్యనారాయణ, తల్లి పేరు వరాలమ్మ. అంపోలు గ్రామంలో ప్రాధమికవిద్య, శ్రీ కూర్మం లో హైస్కూల్ విద్యని అభ్యసించి, ఇంటర్మీడియట్, డిగ్రీ శ్రీకాకుళంలో ఆర్ట్స్ కాలేజీలో ఎం,ఎ ఇంగ్లిష్ లిటరేచర్ ఆంధ్రా యూనివర్సిటిలో చదివారు. డిగ్రీలోనే మొట్టమొదటి నాటిక "తూర్పు తెల్లారింది" రచించారు 7. డా.చిలుకూరి నారాయణరావు (ఆగష్టు 9, 1889 - జూన్ 22, 1951) భాషావేత్త,చరిత్రకారుడు,సంస్కృతాంధ్రపండితుడు.ఈయన విశాఖపట్నం జిల్లా, పొందూరు సమీపంలోని ఆనందపురంలో 1889, ఆగష్టు 9 నజన్మించాడు.తండ్రిభీమాచారి.తల్లిలక్ష్మమ్మ.మాతృభాష కన్నడం. 'ఆంధ్ర బెర్నార్డ్ షా' అనే బిరుదుకూడ ఇతనికి ఉంది. 8. Malladi Venkata KrishnaSharma మల్లాది వేంకట కృష్ణశర్మగారు 1907లో శ్రీకాకుళంలో జన్మించారు.. సుప్రసిద్ధ నాటకాలు, నాటికలూ చాలా రాసి, సినిమాల్లోకి ప్రవేశించారు. తొలి చిత్రం- అంజలి పిక్చర్స్ నిర్మించిన 'పరదేశి' (1953). మల్లాది వెంకట కృష్ణశర్మగారి సినిమా రంగప్రవేశం. ఆయన రాసిన హాస్య నాటకాలు ఎన్నో దొంగాటకం, డొంకలో షరాబు, గ్రీన్రూమ్, కిర్రు గానుగ వంటి నాటికలు బాగా ప్రదర్శితమయ్యేవి. ఐతే, ఆయన పూర్తిపేరు మల్లాది విశ్వనాథశర్మ. 'కవిరాజు' బిరుదు. ఆ బిరుదునే పేరుగా వాడుకున్నారాయన. 1936లో సినిమా రంగంలో ప్రవేశించి, 'భక్త మార్కండేయ (1938)', 'మాలతీ మధనం' (1940), 'పంతులమ్మ' (1943) 'సౌదామిని' (1951) మొదలైన చిత్రాలకు రచన చేశారు. భరణివారు తీసిన 'చక్రపాణి'కి కథకుడు ఆయనే. 9. అట్టాడ అప్పలనాయుడు: ప్రముఖ తెలుగు కథా రచయిత.ఉత్తరాంధ్రకు చెందిన కథా, నవలారచయిత. విజయనగరం జిల్లా, కొమరాడ మండలం గుమడ గ్రామంలో 1953వ సంవత్సరం ఆగష్టు 23వ తేదీన జన్మించాడు.[1] కోటిపాం జిల్లాపరిషత్ హైస్కూలులో పదవ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ సమయంలో శ్రీకాకుళ సాయుధ పోరాటం వైపు ఆకర్షితుడయ్యాడు. జననాట్యమండలిలో పనిచేశాడు. ఇతడు 100కి పైగా కథలు, నాలుగు నవలలు, కొన్ని నాటికలు వ్రాశాడు. ఇతని రచనలు సృజన, అరుణతార, అంకితం, ప్రజాసాహితి, ఇండియాటుడే, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, పుస్తకం, యువత మందస, విపుల, ఆహ్వానం, వార్త, నూతన, ప్రజాశక్తి, ఆంధ్రమాలిక, సుప్రభాతం, నవ్య, రచన, జముకు, నాగావళి, చినుకు, స్వాతి మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఇతని రచనలు సమగ్రంగా అట్టాడ అప్పల్నాయుడు సాహిత్యం అనే పేరుతో మూడు సంపుటాలలో వెలువడింది. 10. భావశ్రీ శ్రీకాకుళానికి చెందిన ఈయన జిల్లా సాంస్కృతిక కౌన్సిల్కు రెండుసార్లు సభ్యునిగా, మూడుసార్లు అధికార భాషా సంఘ సభ్యునిగా వ్యవహరించారు. పద్యం, గద్యం, నాటిక, నాటకం, సమీక్ష, సంగీత రూపకం, గజల్స్, గేయాలు, విమర్శలు, వ్యాఖ్యానాలు, ఏకపాత్రలు, పల్లెసుద్దులు, గిరిజన గీతాలు, అనువాదాలు, హరికథలు, బుర్రకథలు.. ఇలా అనేక సాహితీ ప్రక్రియలలో 120కు పైగా గ్రంథాలు రాసిన సాహితీయోధుడాయన. 11. రావి శాస్త్రి, నారాయణమూర్తి, సీతాలక్ష్మి దంపతులకు 1922 జూలై 30(22)న శ్రీకాకుళంలో జన్మించాడు. ఈయన స్వస్థలము అనకాపల్లి దగ్గర తుమ్మపాల గ్రామము. ఈయన తండ్రి -న్యాయవాది , తల్లి- సాహితీకారిణి. తన తాత గారైన (his maternal grandfather) శ్రీరామమూర్తి ఇంట్లో పుట్టి పెరిగారు .లా కోర్సు పూర్తి అయ్యాక తాత దగ్గరే న్యాయశాస్త్రము లో బేసిక్ విదివిధానాలు నేర్చుకున్నారు . ఇక్కడే తాత దగ్గరే ఉండి కొన్నాళ్లు' లా 'ప్రాక్టిష్ చేసారు . రాచకొండ విశ్వనాధశాస్త్రి వృత్తి రీత్యా న్యాయవాది. అన్యాయాలకు, దౌర్జన్యాలకు గురై చిత్ర హింసలు పడుతున్న దీన, హీన ప్రజల తరపున తన ప్రతి రచనలోను వకాల్తా పుచ్చుకుని సాంఘిక (ఆర్థిక)న్యాయం కోసం "వాదించాడు". సమాజం అట్టడుగు పొరల్లో, అనుక్షణం భయపడుతూ జీవించే అథోజగత్సహొదరుల సమస్యలను, వాటివలన కలిగే దుఖాన్ని సూటిగా గుండెలకు నాటేలా చెప్పి పై జీవితం పట్ల పాఠకుల సానుభూతి గల ఏకైక ప్రతిభావంతుడు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల మాండలికంలో, అట్టడుగు వర్గాల భాషలో, సొగసుగా, ప్రతిభావంతంగా, ప్రభావవంతంగా, పాఠకుల హృదయాలకు హత్తుకు పోయేలా పదునైన రచనలు చేసాడు. 12. బంకుపల్లి మల్లయ్య శాస్త్రి ... కవి , పండితుడు ,సంస్కర్త , గాంధేయవాది , స్వాతంత్ర సమరయోధుడు . జన్మ స్థలము : సింగుపురము .. శ్రీకాకులం మండళం లో పుట్టినతేదీ : 29-04-1876 ,మరణము : 26-09-1947 , రచనలు :ఆంధ్ర వేదములు ,అనుభూతిప్రకాశము ,అస్పృశ్యత ,వివాహతత్వము,కొండవీటి విజయము ,యక్షగాన తత్వము , భగవద్గీతా తత్వము ,సాహిత్యసర్వస్వము , ... మున్నగునవి , కందుకూరి వీరేశలింగం విధవలకు పెళ్లిళ్లు చేస్తే దీన్ని మరింతగా సంస్కరించారు జిల్లాకు చెందిన బంకుపల్లి మల్లయ్య శాస్త్రి. చిన్నవయస్సులో పెళ్లయి గర్భాదానం జరగకుండా విధవ అయిన కన్యలకు వివాహం జరిపించి ఆదర్శంగా నిలిచారు. జీలకర్ర, బెల్లం పెట్టి తాళి కట్టినంత మాత్రాన వివాహం జరిగినట్టు కాదని, గర్భాదానం అయితేనే వివాహం అయినట్టు అని ఆయన వాదించారు. ఈ పద్ధతి మొదటిగా ఆయన తన ఇంట్లో పాటించడంతో ఆయన్ను ఆనాడు సంఘం నుంచి వెలివేసినా మొక్కవోని ధైర్యంతో సవాల్ స్వీకరించి వివాహతత్వం అనే గ్రంథాన్ని రచించి చరిత్రలో చిరస్మరణీయుడయ్యారు. ఆయన కృషికి పాండిత్యానికి మెచ్చి ఇంటాక్ సంస్థ నాగావళి మూడో వంతెనపై విగ్రహాన్ని ప్రతిష్టించింది(06/07/2009) . అంతటి మహానీయులు ఉండడం జిల్లాకు గర్వకారణం. 13.రోణంకి అప్పలస్వామి: అంతర్జాతీయ సాహితీ ప్రపంచానికి పరిచయం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి రోణంకి అప్పలస్వామి . అరసం తొలితరం ప్రముఖులు, రాష్ట్రశాఖ అధ్యక్షవర్గ సభ్యులూ అయిన రోణంకి అప్పలస్వామి గారి శతజయంతి ఈ సెప్టెంబరు 15న జరుగనుంది. ఇంగ్లీషు, ఫ్రెంచ్, స్పానిష్, గ్రీక, హిబ్రూ, ఇటాలియన్ మొదలైన ఆరు యురోపియన్ భాషలలో నిష్ణాతులు. శ్రీశ్రీ, ఆరుద్రలకు తొలి రోజుల్లో స్ఫూర్తినిచ్చినవారు. అల్లసానిపెద్దన, భట్టుమూర్తి, క్షేత్రయ్య మొదలు శ్రీశ్రీ, నారాయణబాబు, చావలి బంగారమ్మ, చాసో మొదలైనవారి కవితల్ని ఆంగ్లీకరించి దేశ, విదేశీ భాషా పత్రికల్లో ప్రచురించారు. అప్పలస్వామిగారు శ్రీకాకుళంజిల్లా టెక్కలి సమీపంలోని ఇజ్జవరం అనే గ్రామంలో 1909 సెప్టెంబరు 15న జన్మించారు. తండ్రి రోణంకి నారాయణ్ , తల్లి - రోణంకి చిట్టెమ్మ . తండ్రి పెట్టిన పాఠశాలలో ప్రాథమిక విద్య ముగించుకుని, విజయనగరం, కాశీ హిందూ విశ్వవిద్యాల యాల్లో చదువుకుని ఎం.ఏ. (ఇంగ్లీషు) పట్టభద్రులయ్యారు. విజయనగరం మహారాజు కళాశాలలో సుమారు 30ఏళ్ళు ఉద్యోగం చేసి - ఇంగ్లీషు శాఖాధిపతిగా 1969లో రిటైరయ్యా రు. మరొక రెండేళ్ళు - ఆంధ్ర విశ్వవిద్యాల యంలో ఎమెరిషస్ ప్రొఫెసర్గా పనిచేశారు. తరువాత టెక్కలిలో స్వగృహం నిర్మించుకుని స్థిరపడ్డారు. 1987 మార్చిలో మరణించారు. 14. భాస్కరభట్ల రమికుమార్ ఓ సాధారణ కుటుంబం లోనుంచి వచ్చి పాత్రికేయుడుగా జీవితమ్లో తొలి ఆడుగులను వేసిన ఈ కుర్రాడు శ్రీకాకుళం జిల్లాలో పుట్టిన వాడే . తన సినీగీతాలతో ప్రస్తుతం ఆంధ్రదేశాన్నింతటినీ ఉర్రూతలూగిస్తున్నారు . దాదాపు 300 పైగా సినీగీతాలు రాసి జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు . రవి కుమార్ సినిమా పాటల రచయిత . " పెల్లెన్దుకే రమణమ్మ " , " ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే " , " బొమ్మను గీస్తే నీలా ఉందని భావుకతకు అద్దంపట్టినా " , "నచ్చావులే " ఇంకా ఎన్నో ఎన్నోన్నో ... 1995 లో హైదరాబాద్ వెళ్ళేరు . కొన్నాళ్ళు ఈనాడు , సితార లో విలేకరి గా పనిచేశారు . తర్వాత సినీ గేయ రచియిత గా పేరు వచ్చింది . సుమారు 300 పాటలు వ్రాసారు . 15. వల్లూరు దాలినాయుడు వల్లూరు దాలినాయుడు. (ఎంఏ, ఎం.ఎ.,ఎం.ఈడీ.,) ఉపాధ్యాయ శిక్షణ: విజయనగరం డైట్లో, ఉపాధ్యాయ వృత్తి: 1989 జూన్ నెల నుంచి విద్యావిషయాలు :బొద్దూరు ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకూ, గుళ్ళ సీతారాంపురం ఉన్నత పాఠశాలలో నుంచి 10వ తరగతి వరకు,రాజాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, గరివిడి ఎస్. డి.ఎస్. కళాశాలలో B.A.డిగ్రీ.,గురజాడ ఎడ్యుకేషన్ సొసైటీ లో బి.ఎడి., ఆంద్రాయూనివర్సిటీ లో ఎం.ఎ.(తెలుగు),(రాజనీతిశాస్త్రం) ఎం.ఎడి. చదువుకున్నారు. దాలినాయుడు రచించిన కథల పుస్తకాలు తెలివైన మనిషి, అన్నదమ్ములు, పేదరాశి పెద్దమ్మ, అమ్మమాట, పిచ్చుక, నక్కతెలివి, బంగారు,గుమ్మడికాయ ,నక్కపోతు అప్పు,పందెం మోజు తీరింది. చిన్నవాడి ఉపాయం, నుట్టడి కథ, డమ్మిడి, బంగారు, మోసగారి నక్క, పొన్గడాల చెట్టు, బాలనాగమ్మ కథలు వంటి పుస్తకాలు ప్రస్తుతం ప్రతి పాఠశాలలోనూ చిన్నారులను ఆకర్షిస్తున్నాయి. దాలినాయుడు రచించిన కథలను న్యూఢిల్లీకి చెందిన చీఫ్ పెదగాజీ కన్సెల్టెంట్ వినయ్ పట్నాయక్ అభినందించడం గమనార్హం.. .స్పూర్తి ప్రధాతలు: విద్యావేత్తలు గిజాబాయి, కృష్ణకుమార్, డా.విక్టర్. 16. గార రంగనాథం పేరు: గార రంగనాథం పుట్టిన ఊరు: గార మండలం, శ్రీకాకుళం జిల్లా రచనా రంగం: కవిత్వం, వ్యాసాలు ప్రత్యేకత: • గ్రామీణ జీవితం, రైతు సమస్యలు, ప్రజల బాధలను ప్రతిబింబించిన రచనలు • సరళమైన భాషలో గాఢమైన భావాలు సాహిత్య సేవ: ప్రాంతీయ కవిత్వానికి గుర్తింపు తీసుకొచ్చిన రచయిత. రాజాం రచయితల సంఘం అద్యక్షులు. కాలం కత్తిమొన మీద కవితా సంపుటి, రాయరత్న మంజూష, చారిత్రిక అన్వేషణ మొదలైన గ్రంధాలను రచించారు. ________________________________________ 17. వావిలపల్లి జగన్నాథ నాయుడు పూర్తి పేరు: వావిలపల్లి జగన్నాథ నాయుడు పుట్టిన ప్రాంతం: మందరాడ గ్రామం ,శ్రీకాకుళం జిల్లా రచనా రంగం: కవిత్వం, సాహిత్య వ్యాసాలు ప్రత్యేకత: • సంప్రదాయ భావాలు + ఆధునిక దృక్పథం • తెలుగు భాషా పరిరక్షణపై రచనలు గుర్తింపు: ప్రాంతీయ సాహిత్య వేదికల్లో గౌరవనీయ రచయిత ________________________________________ 18.తాపీ ధర్మారావు నాయుడు (Tapi Dharma Rao Naidu) తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు, హేతువాది మరియు నాస్తికుడు . జీవిత చరిత్ర ధర్మారావు 1887 సం.లో సెప్టెంబరు 19న బెర్హంపూరు లో జన్మించాడు. ఇతను 1973 మే 8న మరణించాడు. రచనలు ఆంధ్రులకొక మనవి, దేవాలయాలపై బూతుబొమ్మలు ఎందుకు? 1936, పెళ్ళి దానిపుట్టుపూర్వోత్తరాలు 1960, ఇనుపకచ్చడాలు, సాహిత్య మొర్మొరాలు, రాలూ రప్పలూ, మబ్బు తెరలు, పాతపాళీ, కొత్తపాళీ 19. అడవి బాపిరాజు (Adavi Bapiraju) పుట్టిన తేదీ: 23 సెప్టెంబర్ 1895 మరణం: 8 సెప్టెంబర్ 1952 పుట్టిన ఊరు: భామిని మండలం, శ్రీకాకుళం జిల్లా వృత్తి: కథకుడు, కవి, చిత్రకారుడు ప్రసిద్ధ రచనలు: నారాయణ భట్టు, కథలు, వ్యాసాలు 20. కట్టమంచి రామలింగారెడ్డి (Kattamanchi Ramalinga Reddy) పుట్టిన తేదీ: 1880 మరణం: 1959 పుట్టిన ప్రాంతం: శ్రీకాకుళం జిల్లా పరిసర ప్రాంతం వృత్తి: వ్యాసకర్త, విద్యావేత్త రచనలు: సాహిత్య విమర్శలు, తత్వ వ్యాసాలు 🖼 21. మాకినేని బసవ పున్నయ్య (Makkineni Basava Punnaiah) పుట్టిన తేదీ: 1912 మరణం: 1999 పుట్టిన ప్రాంతం: శ్రీకాకుళం జిల్లా వృత్తి: కథకుడు, సంఘ సంస్కర్త రచనల ప్రత్యేకత: సామాజిక అసమానతలపై కథలు ________________________________________ 22. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ (Yarlagadda Lakshmi Prasad) పుట్టిన ప్రాంతం: శ్రీకాకుళం జిల్లా వృత్తి: కవి, కథారచయిత ప్రత్యేకత: గ్రామీణ జీవనాన్ని ప్రతిబింబించే రచనలు 23.బొంగు సూర్యనారాయణ టెక్కలి మండలం పిఠాపురం • సుప్రభాత సహిత సూర్యశతకం , • శ్రీరామక్రిష్ణ యుద్ధం , • నవ్యాంధ్ర సుమతీ శతకం , • రావివలస ఎండల్ మల్లిఖార్జున స్వామివారి క్షేత్ర మహత్యం , • లీలావతార గాధ , • వెంకటేశ్వర శతకం , • శివక్షేత్ర మహర్యం , వంటి పద్యకావ్యాలు పుస్తక రూపం లో విడుదలై ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి . 24.గంటేడ గౌరు నాయుడు తల్లిపేరు: సోములమ్మ తండ్రి పేరు: గంటేడ సత్యంనాయుడు రచనలు :అవతలి ఒడ్డు,ఆసరసాల,ఇది చేదు కథ కాదు,ఏటిపాట,ఒక రాత్రి రెండు స్వప్నాలు,కాటు, కొండమల్లె,గెంజిమెతుకులు,చొక్కాగుడ్డ కోసం,జీవసూత్రం,తిరుగుడు గుమ్మి,దేవుడూ వర్ధిల్లు,నరాలు తెగుతున్న నేల,నాణెంకిందచీమ,నీటిముల్లు… 25.టంకాల సత్యనారాయణ తెలుగు పద్య కవి. కవితా విశారద బిరుదు పొందినవాడు. టంకాల సత్యనారాయణ అన్నపూర్ణ, అప్పన్న దంపతులకు 1908వ సంవత్సరం, జూన్ 30వ తేదీన జన్మించాడు. వైశ్య కులస్థుడు. దేవకుల గోత్రజుడు. శ్రీకాకుళం జిల్లా, కొత్తూరు మండలానికి చెందిన నివగం గ్రామం ఇతని స్వస్థలం. 26.త్రిపురాన వేంకటసూర్యప్రసాదరాయకవి ప్రముఖ సంస్కృతాంధ్ర కవి. ఇతడు తెలగా వంశీయుడు. తల్లి: నారాయణమ్మ. తండ్రి: త్రిపురాన తమ్మయ్యదొర. ఇతని జన్మస్థానము: శ్రీకాకుళం తాలూకాలోని సిద్ధాంతము. జననము: 1889 అక్టోబరు 31 తేది. నిర్యాణము: 1945. 1. నిర్వచన కుమారసంభవము (6 ఆశ్వాసములు. 1913 ముద్రి.) 2. రఘూదయము (4 ఆశ్వా. 1924 ముద్రి.) 3. రతి విలాపము (ద్విపద కావ్యము 1926 ముద్రి.) 4. మొయిలు రాయబారము (కాళిదాసుని మేఘ సందేశమునకు స్వతంత్ర దేశీయ గేయానువాదము. 1940 ముద్రి.) 27.పురుషోత్తం చౌదరి (సెప్టెంబరు 5, 1803 - ఆగష్టు 23, 1890) తెలుగు క్రైస్తవ పదకవితా పితామహుడు.. శ్రీకాకుళం జిల్లా తెంబూరు (పాతపట్నం) శివారు మదనాపురం (తెంబూరు (పాతపట్నం) లో 1803, సెప్టెంబరు 5 న బెంగాళీ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుభద్రాదేవి, కూర్మానాథ చౌదరి దంపతులకు జన్మించారు. 28.మాడుగుల వేంకట సూర్య ప్రసాదరాయ కవి శతావధాని, కవి, బహుగ్రంథకర్త. అంతే కాక వైద్యశాస్త్ర, జ్యోతిష శాస్త్ర, మంత్రశాస్త్రాలలో ప్రవీణుడుఇతడు ఒక జమీందారీ కుటుంబంలో 1912, జూలై 31న జన్మించాడు. వీరభద్రసీతారామరాయకవి, సన్యాసాంబ ఇతని తల్లిదండ్రులు. శ్రీకాకుళం జిల్లా, బొంతల కోడూరు ఇతని జన్మస్థానం. సుబ్బారావు పాణిగ్రాహి విప్లవ ప్రజాకవి. ఇతడు 1934, సెప్టెంబర్ 8న శ్రీకాకుళం జిల్లా, సోంపేట మండలం బారువాలో ఒక పూజారి కుటుంబంలో జన్మించాడు రచనలు నాటికలు రచనలు : కుంకుమరేఖ,రిక్షావాలా,ఎండమావులు,కాలచక్రం,విముక్తి . 29.సోమంచి వాసుదేవరావు ( 1902 నవంబరు 16 - 1965 సెప్టెంబరు 27) ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం నకు చెందిన కవి. తల్లిదండ్రులు సోమంచి కోదండరామయ్య, సూరమ్మ దంపతులకు సనాతన వైదీక బ్రాహ్మణ కుటుంబంలో వాసుదేవరావు జన్మించారు. శ్రీ శివస్తుతి నవగ్రహ స్తోత్రములు, శ్రీ వెంకటేశ్వరస్తవము, శ్రీ కిష్కింధకాండము, కర్ణుడు-గాంధారీ నిర్వేదనము 30.మజ్జి భారతి : శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం డోలపేట వీరి నివాసం తల్లిదండ్రులు: మజ్జి చంద్రినాయుడు,లోలాక్షి. రచనలు: నాన్నమ్మ కతలు, కాలం ఘణీభవించింది,ప్రతిచర్య,కనిపించనితెర మొదలైన రచనలు చేశారు. పిల్లా తిరుపతిరావు నివాసం రాజాం. వ్యాస కర్త. అనేక పత్రికలలో సమకాలీన సమస్యలపైన, అంశాలపై వ్యాసాలు రాశారు. పచ్చడం అనే వ్యాస సంపుటి ఈయన రచన .

No comments:

Post a Comment