*పద్య రచనందు చేయకూడని దోషములు..,*
పద్యరచన యందు సహజముగా వచ్చు దోషాలు 10 గుర్తించారు.మన పూర్వులు.,అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి
*1--గణ భంగము:*
గురువు వ్రాయ వలసిన స్థానంలో లఘువు వ్రాసినా.. లఘువు బదులు గురువు వ్రాసినా ఈ గణ భంగమనే దోషం వస్తుంది.
*2--యతి భంగము:*
యతి స్థానము నందు యతి అక్షరం లేకపొయినా..యతికి యతిమైత్రి సరిపోక పోయిన..యతి స్థానం మారినా.... అది యతి భంగముగా గుర్తించ వలెను.
*3--సంశయము:*
పద్య పాదాలలో అర్ధం సరిగ్గా చెప్పలేకపొయినా.. అర్ధం లో సంశయమున్నా.. సంశయ దోషము అంటారు
*4--విసంధి:*
సంధి చేయవలసిన చోట.. సంధి చేయకపోతే అది విసంధి దోషము అవుతుంది..తప్పనిసరిగా సంది చేయవలెను
*5--పునరుక్తము:*
ఒక శబ్దాన్ని మరల మరల ప్రయోగించడం, ఒకే అర్ధం వచ్చే విధముగా ప్రయోగించకూడదు.
*6--అపశబ్దము:*
వ్యాకరణం తో సంభందము లేకుండా...కుసంధులు, దుస్సంధి వైరి సమాసాలు ఉపయోగించరాదు.
*7. వ్యర్ధము:*
అనుగుణముగా లేని కూడని మాటలు వాడిన.. "వ్యర్ధము" అనే దోషము కలుగుతుంది.
*8-- అపక్రమము:*
వరుస తప్పడమే అపక్రమము.
ఉదా: బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు.. అంటూ.. లక్ష్మీ దేవి, సరస్వతీ దేవి, పార్వతీ దేవి అన రాదు...సరస్వతీ దేవి, లక్ష్మీ దేవి, పార్వతీ దేవి అని అనాలి.
*9-- అపార్ధము:*
సరి అయిన అర్ధము లేకుండా.. ప్రాస కోసమో.. యతి కోసమో శూన్య పదాలు వాడ రాదు వాడిన ఎడల అపార్ధ దోషమంటారు.
*10. విరోధము:* .
ప్రకృతి విరుద్ధం గా వర్ణించ రాదు. ఉదా: విజయవాడ కనక దుర్గమ్మ పాదాల చెంత గోదావరి నదిలో స్నానమాచరించి అనరాదు..(అక్కడ ప్రవహించేది కృష్ణమ్మ తల్లి కదా)
నిషిద్ధ గణము వాడుట: కంద పద్యం లో.. జగణం బేసి గణము గా వాడ రాదు కదా,,,6 వగణము తప్పనిసరిగా జగణము,,లేద నలము వ్రాయలికదా,,ఆవిధంగా వాడకుంటే అది నిషిద్ద గణం అవుతుంది.
*పదచ్చేద భంగము:* ద్విపద, మంజరీ ద్విపద లలో ఏ పాదమునకు ఆపాదము విడి విడివిడిగా వ్రాయలి రెండు పాదములు కలుప రాదు.
పద్యరచన యందు సహజముగా వచ్చు దోషాలు 10 గుర్తించారు.మన పూర్వులు.,అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి
*1--గణ భంగము:*
గురువు వ్రాయ వలసిన స్థానంలో లఘువు వ్రాసినా.. లఘువు బదులు గురువు వ్రాసినా ఈ గణ భంగమనే దోషం వస్తుంది.
*2--యతి భంగము:*
యతి స్థానము నందు యతి అక్షరం లేకపొయినా..యతికి యతిమైత్రి సరిపోక పోయిన..యతి స్థానం మారినా.... అది యతి భంగముగా గుర్తించ వలెను.
*3--సంశయము:*
పద్య పాదాలలో అర్ధం సరిగ్గా చెప్పలేకపొయినా.. అర్ధం లో సంశయమున్నా.. సంశయ దోషము అంటారు
*4--విసంధి:*
సంధి చేయవలసిన చోట.. సంధి చేయకపోతే అది విసంధి దోషము అవుతుంది..తప్పనిసరిగా సంది చేయవలెను
*5--పునరుక్తము:*
ఒక శబ్దాన్ని మరల మరల ప్రయోగించడం, ఒకే అర్ధం వచ్చే విధముగా ప్రయోగించకూడదు.
*6--అపశబ్దము:*
వ్యాకరణం తో సంభందము లేకుండా...కుసంధులు, దుస్సంధి వైరి సమాసాలు ఉపయోగించరాదు.
*7. వ్యర్ధము:*
అనుగుణముగా లేని కూడని మాటలు వాడిన.. "వ్యర్ధము" అనే దోషము కలుగుతుంది.
*8-- అపక్రమము:*
వరుస తప్పడమే అపక్రమము.
ఉదా: బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు.. అంటూ.. లక్ష్మీ దేవి, సరస్వతీ దేవి, పార్వతీ దేవి అన రాదు...సరస్వతీ దేవి, లక్ష్మీ దేవి, పార్వతీ దేవి అని అనాలి.
*9-- అపార్ధము:*
సరి అయిన అర్ధము లేకుండా.. ప్రాస కోసమో.. యతి కోసమో శూన్య పదాలు వాడ రాదు వాడిన ఎడల అపార్ధ దోషమంటారు.
*10. విరోధము:* .
ప్రకృతి విరుద్ధం గా వర్ణించ రాదు. ఉదా: విజయవాడ కనక దుర్గమ్మ పాదాల చెంత గోదావరి నదిలో స్నానమాచరించి అనరాదు..(అక్కడ ప్రవహించేది కృష్ణమ్మ తల్లి కదా)
నిషిద్ధ గణము వాడుట: కంద పద్యం లో.. జగణం బేసి గణము గా వాడ రాదు కదా,,,6 వగణము తప్పనిసరిగా జగణము,,లేద నలము వ్రాయలికదా,,ఆవిధంగా వాడకుంటే అది నిషిద్ద గణం అవుతుంది.
*పదచ్చేద భంగము:* ద్విపద, మంజరీ ద్విపద లలో ఏ పాదమునకు ఆపాదము విడి విడివిడిగా వ్రాయలి రెండు పాదములు కలుప రాదు.
No comments:
Post a Comment