Monday 24 September 2012

మురళి // అమెరికా వాడి 'అమ్మపాలు' ఐస్ క్రీం పార్లర్//

అమెరికా వాడు అమ్మ పాలు తాగితే కదా 
వాడికి అమ్మ పాల రుచేమిటో తెలిసేది.
డబ్బుంది కదాని డబ్బాలే కొంటాడు.
డబ్బా పాలే అమృతం అనుకుంటాడు.

వాడి అమ్మ చైల్డ్ కేర్ సెంటర్లో పెడితే
వీడేమో అమ్మని ఓల్దేజ్ హోం లో ఉంచుతాడు
ధన సంపాదనే లక్ష్యం గా బ్రతికే వారికి
అమ్మ పాల కమ్మదనం ఏమి తెలుస్తుందిలే

అనురాగం అన్నది ఒకటుందని వాడికేమి తెలుసు
అది ఎంతకి దొరుకుతుంది? కొంటానంటాడు.
మమకారం అంటేమిటో వాడికేమి తెలుసు?
అది ఎక్కడ దొరుకుతుంది? అడుగుతాడు వాడు 
(భాస్కర్ II అమ్మ పాలు అమృతం II కవితకు స్పందన గా)
మురళి//గుజ్జనగూళ్ళు//
కవిత రాద్దామని కూర్చుంటే
కలం కదలడం లేదు.

విసిగిపోయిన కలం 
తన సిరాను ఎండబెట్టింది.

ఊహలు పదాల కొసంవెంపర్లాడితే
పదాలు భావాల కోసం పరుగులు తీసాయి.

వస్తువునకు దొరకని భావం
కలాన్ని పస్తులు పెట్టడం ఏం భావ్యం.

పదాలంటున్నాయి... 
మేం బిజీగా ఉన్నామని,

సమాజం లోని కుల్లును కడగడం లో
కవులకు సాయం చేద్దామని 

వారి భావాల మాటున దాగున్నాయట.
వారి ఊహల ఊయలలో ఓలలాడుతున్నాయట.

భావాల కోసం వెళ్లిన పదాలు 
ఆ జల్లులలో తడిచి ముద్దౌతున్నాయట.

నే పిలిస్తే వస్తానుండు, 
కొంచెం ఓపిక పట్టు అంటున్నాయి.

కవి కాల్పనిక లోకం లో
కాసేపు విహరించాలంటున్నాయి. 

రవి కాంచని అందాలను 
పరవశమున చూస్తున్నాయట.

కవి అనే గిజిగాడు కడుతున్న గుజ్జన గూటికి
ఊహలై, సన్నని ఈనెలై సహకరిస్తున్నాయట

మనసుకందని భావాలకై ఊహలనే రెక్కలతో
మకరందం కొసం తావి అనుకొని కాగితం పై 

పిచ్చి పిచ్చిగా పరుగులు తీస్తున్నాయట.

Friday 21 September 2012


పెద్దమ్మ ఇంటి ముందు ఉన్న తులసిమొక్కలు వాడిపోయాయి."ఓరి నాయనో ఓరి దేవుడో నా కొడుకులు ఆపదలో ఇరుక్కున్నారో " అంటూ దొర్లి దొర్లి ఏడుస్తుండట పెద్దమ్మ. దారిన పార్వతీ పరమేస్వరులు వెళ్ళిపోతూ మారు వేషాల్లో అక్కడికి వచ్చి, "నీ కొడుకులూ, కూతురూ క్షేమంగానే ఉన్నారు"అని చెప్పి, ఒక మిరపకాయ ఇచ్చి "సల్లందితో నంజుకుంటే నికు సీమ్మిరపకాయలాటి కొడుకు పుడతాడు. వాడు అందరిని విడిపించుకొస్తాడు"అని చెప్పి అదృశ్యం అయిపోయారు.
కాలపోలికి తొమ్మిది నెలలు, ఆకాలపోలికి తొమ్మిది ఘడియలు అనంట్లే ఒక కొడుకు పుట్టాడు.చిన్నోడు అని పేరు పెట్టింది. పుట్టీపుట్టగానే పుట్టిడు నూకలజావ తినీసాడట."అమ్మా నేనొక్కడ్నేనా నాతోడ ఇంకెవరైనా ఉన్నారా?"అని అడిగితే జరిగినదంతా చెప్పింది పెద్దమ్మ. ఒక పెద్ద బళ్ళెం పట్టుకొని బయలు దేరాడు.
చిన్నోడికీ చెరుకుల బండీ,బెల్లం బండీ,చుట్టల బండీ కనబడ్డాయట. బండి నాయుడ్లు తిరిగొచ్చీసరికి అవన్నీ అవ్వజేస్సినాడట.తోవలో ఊబి దగ్గరాగి అక్కడున్న జనాన్ని ఎలుగుబంటి జాడ గురించి అడిగితే "దాని ఊసు నీకెందుకు ?భూమికి బుక్కడు లేవు,"అన్నారు.అప్పుడు చిన్నోడు" నేను మా అప్పని, మా అన్నల్ని ఎలుగుబంటినుంచి విడిపించడానికి వెల్తున్నాను" అన్నాడు. "నువ్వుగాని బండిని ఎగ్గొట్టిస్తే అంతపనోడివేనని ఒప్పుకుంటాం" అన్నారు వారు. ఒక మునకాల కర్ర తీసుకొని దాని చివర ఒక మేకు దిగ్గొట్టి ,నొగ ఎక్కి ఒక ఎద్దు తోక మడిచి మరో ఎద్దు ముడ్డి మీద మునకాక కర్రతో ఒక్కటేసినాడట అంతే ఆబాధకు ఒక్కసారి ఎద్దులు ముందుకురికినాయి. బండి ఎగబడిపోయింది. "వీరాధి వీరుడు శూరాధి శూరుడని పొగిడి,చీమ్మిరపకాయకే వర్రెక్కువ" అంటూ "ఎలుగుబంటిని జయించి విజయుడవై తిరిగిరా" అని దీవించి పంపారు.దారిలో ఒక ఏరు. ఆఏటింట చీమలు కొట్టుకుపోతున్నాయి. చీమల్ని ఒడ్డుకు తీసి కాపాడాడు చిన్నోడు. అప్పుడాచీమలు "ఎప్పుడైనా మాఅవసరమొస్తే అప్పుడు మమ్మల్ని తలుచుకో మేము వచ్చి సాయం చేస్తాము" అని చెప్పాయి.
       చిన్నోడు ఎలుగుబంటి ఒండ చేరుకొని ఎలుగుబంటితో "మా అన్నల్ని,అప్పను ఎక్కడ దాచావో చెప్పు? మర్యాదగా వాళ్ళని అప్పగించావా సరే లేకపోతే నిన్ను చంపెస్తాను"అని బళ్ళెం ఎక్కుపెట్టాడు. "సర్లే గాని నేను ఏటికెళ్ళి తానం పోసుకొని వచ్చీసరికి ఈసోలూ, నూకలూ వేరుచేసీయాల అలా చేస్తే నన్ను చంపి మీవాళ్ళని తీసుకుపోదువు గాని, లేకపోతేనిన్ను మింగెస్తాను"అంది. "పందెం అంటే పందెం' అని ఏటికి వెళ్ళీపోయింది. అప్పుడు చీమలు గుర్తుకొచ్చాయి. వెంటనే తలచుకోగా గింజకొక్క చీమ వచ్చి అన్నింతినీ వేరు చేస్సాయి. కొంతసేపటికి ఎలుగుబంటి వచ్చి చూసి, పందెం లో ఓడిపోయినట్లు ఒప్పుకొని లొంగిపోయింది. అన్నలనీ అక్కను విడిపించి ఎలుగు బంటితో "ఇకనైనా భుద్ధిగా బతుకు "అని చెప్పి ఇంటికి తీసుకుపోయి అందరూ హాయిగా ఉన్నారట.

మురళి// పందెం//
    అనగనగా ఒక ఊరిలో ఒక పేదరాసి పెద్దమ్మ ఉండేదట. ఆమెకు ఏడుగురు కొడుకులు ఒక కూతురూ ఉన్నారట. ఒక రోజు పెద్దమ్మకు ఒంట్లో బాగోపోతే కూతుర్ని పూలు కోసుకు రమ్మని అడవికి పంపిందట. అడవిలో ఒక ఎలుగుబంటి ఆమెను ఎత్తుకు పోయిందట. విషయం తెలిసి పెద్దమ్మ తన కొడుకులకు చెబితే వారు ఏడు తులసి మొక్కలు నాటి ఇవిగాని చనిపోతే మాగురించి చూడక్కరలేదు. ఒకవేళ ఓడిపోతే మాకేదొ ఆపద వాటిల్లినట్లుగా,బివి బతికేవుంటే చెల్లిని క్షేమంగా తీసుకువస్తామని ఆనిక పెట్టి ఎలుగుబంటి జాడ కనుగొనేందుకు బయలుదేరారు.
        దారిలో ఒక చెరుకుల బండి కనిపించింది. బండి అతను "మీరెక్కడికి వెలుతున్నారు" అని అడిగితే "మేము ఎలుగుబంటిని చంపడానికి వెలుతున్నాం " అన్నారు. "మీరు అంతటి వీరులైతే నేను పలకర్ర చెసి వచ్చేలోగా బండెడు చెరుకులను తినీయాలి"అని చెప్పి బండి అతను వెళ్ళాడు.అతను తిరిగి వచ్చేసరికి ఒక్క బొద్దు కూడా తినలేక పోయారు."ఓరెళ్ళర్రా ఎలుగుబంటిని సంపెత్తారట" మొదటి దానికి మోగుడు లేకపోతే కడదానికి కళ్యాణమాట" అని అనుకొని తన దారిని తాను పోయాడట.
         అలా కొంత దూరం వెళ్ళేసరికి ఒక బెల్లపుకుండల బండి ఎదురైందట."ఓయ్ బండి నాయుడూ నీకుగాని ఎలుగుబంటి కనిపించిందా?" అని పెద్దమ్మ కొడుకులు అడిగారు.అతను  "లేదు, ఆబంటి ఊసు మీకెందుకు?" అన్నాడు. దాన్ని సంపీసి మాచెల్లెల్ని విడిపించుకు వస్తాము" అన్నారు వీరు. అప్పుడు బండి అతను "అంతపాటి ఈరాది ఈరులైతే నేను మొకం కడుక్కోనొచ్చేసరికి గాని మీరు బండెడు బెల్లం తినేస్తే అప్పుడు ఒప్పుకుంటాను" అని చెప్పి వెళ్ళాడు.అతను తిరిగి వచ్చేసరికి వీరు ఇంకా ఒక్క కుండనే బక్కురుతున్నారు."ఉట్టికెగర్లేనమ్మ స్వర్గానికెగిరిందట" అంటూ తన దారిని పోయాడట బండివాడు.
ఇంకాస్తా దూరం వెళ్ళేసరికి ఒక చుట్టలబండి కనిపించిదట."ఓరయ్యల్లారా ఇటెటెల్తన్నారు అటు గనెళ్తే మిమ్మల్ని ఎలుగుబంటి నంచుకుంతాది" అన్నాడు బండివాడు.అప్పుడు వీరు" ఓహో! ఎలుగుబంటినెతుక్కుంటూ మేము వెళ్తున్నాం" అన్నారు." ఓసోస్ అంతపాటోలోనేటి? అయితే నేను పకాలి(10 గంటలకు తినే గంజి అన్నం)తినేసి వచ్చేసరికి బండెడు సుట్టలూ మీరు కాల్చియ్యాల" అని వెళ్ళాడు.వాడు పకాలి తినేసి వచ్చేసరికి ఒక్క చుట్టల కట్ట కూడా కాల్చలేకపోయారు." ఓరె సాలుసాలెళ్ళర్రా ఉడతూపులకి సింతకాయల్రాల్తాయా"అంటూ వెళ్ళిపోయాడు.
అలా వెల్తుంటే దారిలో ఒక ఊబి(బురద మడుగు) ఉన్నాదట. ఊబిలో ఒక ఎడ్ల బండి దిగబడిపోయిందట.ఎవరెంత ప్రయత్నం చేసినా ఒడ్డుకు లాగలేక పోయారు. వీళ్ళు అందరినీ పక్కకెల్లమని అరకెత్తినారట. అంతే మరికాస్తా దిగబడిపోయింది."కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందట". మనిసొక మాట అనేసరికి సిగ్గుపడిపోయి ఎలుగుబంటి ఒండ(గుహ)వైపుగా వెల్లిపోయారు. అక్కడ ఒండ ముందు ఒక పెద్ద సాపరాయి. రాయిమీద సోలు(రాగులు), నూకలు ఎందేసిందట ఎలుగు.వీరిని చూసి " మా ఈరకాలు(బావలు)లాగున్నారు,ఎందుకొచ్చారు?" అనీడిగితే "నిన్ను చంపి చెల్లిని తీసుకు వెళ్ళడానికి" అన్నారు వారు. అలగే సంపిద్దురు గాని, నేనేటికెళ్ళి తానం పోసుకొని వచ్చేలోగా సోలు మల్ల సోలూ, నూకల మల్ల నూకలు ఇడదీసీయాల లేక పోతే మిమ్మల్ని నేను మింగెస్తానని సోలూ,నూకలూ కలిపేసి వెళిపోయింది.తిరిగొచ్చేసరికి సోలడు గింజలు కూడా విడదీయలేకపోయారు. పందెం ప్రకారం ఒక తాటితో వారిని కట్టివేసి " రోజు శనివారం నేను కౌసు తిన్ను, రేపు తింటానని చెప్పి  ఏటికి వెళ్ళిపోయింది .          
పెద్దమ్మ ఇంటి ముందు ఉన్న తులసిమొక్కలు వాడిపోయాయి."ఓరి నాయనో ఓరి దేవుడో నా కొడుకులు ఆపదలో ఇరుక్కున్నారో " అంటూ దొర్లి దొర్లి ఏడుస్తుండట పెద్దమ్మ. దారిన పార్వతీ పరమేస్వరులు వెళ్ళిపోతూ మారు వేషాల్లో అక్కడికి వచ్చి, "నీ కొడుకులూ, కూతురూ క్షేమంగానే ఉన్నారు"అని చెప్పి, ఒక మిరపకాయ ఇచ్చి "సల్లందితో నంజుకుంటే నికు సీమ్మిరపకాయలాటి కొడుకు పుడతాడు. వాడు అందరిని విడిపించుకొస్తాడు"అని చెప్పి అదృశ్యం అయిపోయారు.
కాలపోలికి తొమ్మిది నెలలు, ఆకాలపోలికి తొమ్మిది ఘడియలు అనంట్లే ఒక కొడుకు పుట్టాడు.చిన్నోడు అని పేరు పెట్టింది. పుట్టీపుట్టగానే పుట్టిడు నూకలజావ తినీసాడట."అమ్మా నేనొక్కడ్నేనా నాతోడ ఇంకెవరైనా ఉన్నారా?"అని అడిగితే జరిగినదంతా చెప్పింది పెద్దమ్మ. ఒక పెద్ద బళ్ళెం పట్టుకొని బయలు దేరాడు.
చిన్నోడికీ చెరుకుల బండీ,బెల్లం బండీ,చుట్టల బండీ కనబడ్డాయట. బండి నాయుడ్లు తిరిగొచ్చీసరికి అవన్నీ అవ్వజేస్సినాడట.తోవలో ఊబి దగ్గరాగి అక్కడున్న జనాన్ని ఎలుగుబంటి జాడ గురించి అడిగితే "దాని ఊసు నీకెందుకు ?భూమికి బుక్కడు లేవు,"అన్నారు.అప్పుడు చిన్నోడు" నేను మా అప్పని, మా అన్నల్ని ఎలుగుబంటినుంచి విడిపించడానికి వెల్తున్నాను" అన్నాడు. "నువ్వుగాని బండిని ఎగ్గొట్టిస్తే అంతపనోడివేనని ఒప్పుకుంటాం" అన్నారు వారు. ఒక మునకాల కర్ర తీసుకొని దాని చివర ఒక మేకు దిగ్గొట్టి ,నొగ ఎక్కి ఒక ఎద్దు తోక మడిచి మరో ఎద్దు ముడ్డి మీద మునకాక కర్రతో ఒక్కటేసినాడట అంతే ఆబాధకు ఒక్కసారి ఎద్దులు ముందుకురికినాయి. బండి ఎగబడిపోయింది. "వీరాధి వీరుడు శూరాధి శూరుడని పొగిడి,చీమ్మిరపకాయకే వర్రెక్కువ" అంటూ "ఎలుగుబంటిని జయించి విజయుడవై తిరిగిరా" అని దీవించి పంపారు.దారిలో ఒక ఏరు. ఆఏటింట చీమలు కొట్టుకుపోతున్నాయి. చీమల్ని ఒడ్డుకు తీసి కాపాడాడు చిన్నోడు. అప్పుడాచీమలు "ఎప్పుడైనా మాఅవసరమొస్తే అప్పుడు మమ్మల్ని తలుచుకో మేము వచ్చి సాయం చేస్తాము" అని చెప్పాయి.
       చిన్నోడు ఎలుగుబంటి ఒండ చేరుకొని ఎలుగుబంటితో "మా అన్నల్ని,అప్పను ఎక్కడ దాచావో చెప్పు? మర్యాదగా వాళ్ళని అప్పగించావా సరే లేకపోతే నిన్ను చంపెస్తాను"అని బళ్ళెం ఎక్కుపెట్టాడు. "సర్లే గాని నేను ఏటికెళ్ళి తానం పోసుకొని వచ్చీసరికి ఈసోలూ, నూకలూ వేరుచేసీయాల అలా చేస్తే నన్ను చంపి మీవాళ్ళని తీసుకుపోదువు గాని, లేకపోతేనిన్ను మింగెస్తాను"అంది. "పందెం అంటే పందెం' అని ఏటికి వెళ్ళీపోయింది. అప్పుడు చీమలు గుర్తుకొచ్చాయి. వెంటనే తలచుకోగా గింజకొక్క చీమ వచ్చి అన్నింతినీ వేరు చేస్సాయి. కొంతసేపటికి ఎలుగుబంటి వచ్చి చూసి, పందెం లో ఓడిపోయినట్లు ఒప్పుకొని లొంగిపోయింది. అన్నలనీ అక్కను విడిపించి ఎలుగు బంటితో "ఇకనైనా భుద్ధిగా బతుకు "అని చెప్పి ఇంటికి తీసుకుపోయి అందరూ హాయిగా ఉన్నారట.


శనివారం 21 జూలై 2012

వల్లూరు మురళి || నేడేమైనాయి? ||

తొలకరి వాన చినుకు కోసం ఎదురు చూసే
రైతు కళ్ళల్లో కన్నీరు ఏమయింది?
పొలం లో పగడాలు పండాయ అన్నట్లు
ఆరుద్ర పురుగుల అలికిరి ఏమయింది?

గట్లపై వెళుతుంటే కళ్ళకు అడ్డం పడే
గుట్ల కొద్ది రోకలి బండి పిల్లల ఏమయ్యాయి?
వర్షపు నీటిలో ప్రాకే కర్షక మిత్రులు ఎక్కడ?
దీపపు కాంతికి ఎగిరోచ్చే రెక్కల పురుగు లేవి?

సెలవోచ్చిందంటే చాలు నేరేడు చెట్ల పైనే కొలువు
వేడి పళ్ళు కావాలా, చల్లని పళ్ళు కావాలా అంటూ
మిత్రుల నాటపట్టించే రోజులేమయ్యాయి?
మోదుగ దొప్పలలో తెచ్చిన నేరేల్లేమైనాయి?

పిల్ల కాలువ లో పట్టి తెచ్చిన చేప పిల్లలేవి?
జల కలతో నిండుగా ఉండే చెరువులు
చెరువులలో కొట్టే ఈత పందేలు నేడేమైనాయి?
కోనీటిలోని నల్ల కలువలు ఏమయ్యాయి?
ఏ చేతి వాటానికి బలై చెరువులే కనుమరుగైనాయో?

ఊరిచివర ఊడలమర్రి చెట్టు నీడలో చేరి
నేస్తాలతో కూడి ఆడిన ఊసులు నేడేమైనాయి?
కిలకిల రావాల పక్షుల అలజడి ఏమైంది?
ఏ సామిల్లో, ఏ ప్రోక్లినరో నమిలేసి ఉంటుందా?

నల్ల ధనాన్ని తెల్లగ చేయగ పేదల పొలాలను
కబలించి పచ్చని పంట పొలాలను సైట్ లుగా చేసారా?

పుట్టల పై వెతికి పట్టుకొచ్చిన పుట్ట గోడుగులేవి?
పొదల్లో దూరి ఏరుకోచ్సిన బలుసుపల్లేవి?
మెరక పొలం లో కాల్చిన వేరుశనగ కాయలేవి?
ఆ మెరక పొలాలు మరి ఏమయ్యాయి?
రియల్ ఎస్టేట్లు, సెజ్ లుగా మరిపోయవా?
*20-07-2012

వల్లూరి మురళి || పాపం కబోది ||

కళ్ళుండి చూడలేని కబోది
పైసలకి కక్కుర్తి పడి రిజర్వేషన్ భోగిలోకి
అనుమతించిన టి సి కళ్ళున్న కబోది


లంచం ఇస్తే గాని ఫైళ్లు చూడలేని
అవినీతి అధికారి కళ్ళున్న కబోది

కోట్ల టిప్ కి మొగమాట పడిన
న్యాయమూర్తి కళ్ళు మూసిన కబోది

అధికార పార్టి కనుసన్నల్లో మసలే
సి బి ఐ కళ్ళు తెరిచిన కబోది

డొక్కు బస్సులకు పర్మిట్లిచ్చే
ఆర్. టి. ఎ. అధికారి కళ్ళుగానని కబోది

రాష్ట్రం లో రోడ్ల దుస్థితి కనరాని
మంత్రులు, అధికార్లు కళ్ళు మూసుకున్న కబోదులు

అరకొర పాఠ్య పుస్తకాలతో,
నియామకాలు లేని ఉపాద్యాయులతో
ఉనిఫాం లేని విద్యార్ధులతో,
నాణ్యత లేని మద్యాహ్న భోజనాలతో

నీరులేని మరుగు దొడ్లతో,
వసతులేని హాస్టల్ లతో,
పట్టించుకోని వార్డన్లతో

పర్యవేక్షణ లేని విద్యాధికార్లతో
నడుస్తున్న పాఠశాలను పట్టించుకోని ప్రభుత్వం
కళ్ళుండి చూడలేని కబోది
*31-07-2012

మురళి// మధురానుభూతి//

నీ ఊసుల మరుమల్లెల విరి సోయగం
నా మనసును పరవశమున మరిపించెను

నీ జ్ఞాపకాల తోటలోని విరులను సారంగమై
నీ మధురానుభూతుల మధువులనే గ్రోలగా

నీ ఒడితలగడపై నాతలనిడి విసిరిన కురుల
వింజామరలే మలయ మారుతమై వీయగా

భానుతప్త రవికాంతశ్శిల వంటి నాఎదపై
నీ పెదవుల నీహార కందళ చుంబనం
నీరై కరిగి హుతాసన జ్వాలకు ఆవిరై పోగా

నీ కన్నుల వెన్నెలలు తాకిన నా వదనం
కొలనిలోని కలువ కన్నె యై వికసించగా

నీ నవనీతపు చెక్కిలిపై నా పెదవుల స్పర్శ
నామదిలో కలిగెను ఊపిరి సలపని అలజడులే

నీ అధరామృత మధుధారల సేవనలొ నాపెదవులు
చిరు దరహాసపు తొలకరులలో తడిచేనులే

చల్లని నా శ్వాస తాకి నీ పయోధరం వర్షించగ
మెల్లగ తుఫాను రేగెను నా ఎద పయోనిధిలో

నీ చిరునవ్వుల దరహాసపు చంద్రికలే
కురిపించెను మరుమల్లెల విరిజల్లులు
7.10 pm 21/9/12