పెద్దమ్మ
ఇంటి ముందు ఉన్న తులసిమొక్కలు
వాడిపోయాయి."ఓరి నాయనో ఓరి
దేవుడో నా కొడుకులు ఏ
ఆపదలో ఇరుక్కున్నారో " అంటూ దొర్లి దొర్లి
ఏడుస్తుండట పెద్దమ్మ. అ దారిన పార్వతీ
పరమేస్వరులు వెళ్ళిపోతూ మారు వేషాల్లో అక్కడికి
వచ్చి, "నీ కొడుకులూ, కూతురూ
క్షేమంగానే ఉన్నారు"అని చెప్పి, ఒక
మిరపకాయ ఇచ్చి "సల్లందితో నంజుకుంటే నికు సీమ్మిరపకాయలాటి కొడుకు
పుడతాడు. వాడు అందరిని విడిపించుకొస్తాడు"అని చెప్పి అదృశ్యం
అయిపోయారు.
ఈ
కాలపోలికి తొమ్మిది నెలలు, ఆకాలపోలికి తొమ్మిది ఘడియలు అనంట్లే ఒక కొడుకు పుట్టాడు.చిన్నోడు అని పేరు పెట్టింది.
పుట్టీపుట్టగానే పుట్టిడు నూకలజావ తినీసాడట."అమ్మా నేనొక్కడ్నేనా నాతోడ
ఇంకెవరైనా ఉన్నారా?"అని అడిగితే జరిగినదంతా
చెప్పింది పెద్దమ్మ. ఒక పెద్ద బళ్ళెం
పట్టుకొని బయలు దేరాడు.
చిన్నోడికీ
చెరుకుల బండీ,బెల్లం బండీ,చుట్టల బండీ కనబడ్డాయట. ఆ
బండి నాయుడ్లు తిరిగొచ్చీసరికి అవన్నీ అవ్వజేస్సినాడట.తోవలో ఊబి దగ్గరాగి
అక్కడున్న జనాన్ని ఎలుగుబంటి జాడ గురించి అడిగితే
"దాని ఊసు నీకెందుకు ?భూమికి
బుక్కడు లేవు,"అన్నారు.అప్పుడు చిన్నోడు" నేను మా అప్పని,
మా అన్నల్ని ఎలుగుబంటినుంచి విడిపించడానికి వెల్తున్నాను" అన్నాడు. "నువ్వుగాని ఈ బండిని ఎగ్గొట్టిస్తే
అంతపనోడివేనని ఒప్పుకుంటాం" అన్నారు వారు. ఒక మునకాల
కర్ర తీసుకొని దాని చివర ఒక
మేకు దిగ్గొట్టి ,నొగ ఎక్కి ఒక
ఎద్దు తోక మడిచి మరో
ఎద్దు ముడ్డి మీద మునకాక కర్రతో
ఒక్కటేసినాడట అంతే ఆబాధకు ఒక్కసారి
ఎద్దులు ముందుకురికినాయి. బండి ఎగబడిపోయింది. "వీరాధి వీరుడు
శూరాధి శూరుడని పొగిడి,చీమ్మిరపకాయకే వర్రెక్కువ" అంటూ "ఎలుగుబంటిని జయించి విజయుడవై తిరిగిరా" అని దీవించి పంపారు.దారిలో ఒక ఏరు. ఆఏటింట
చీమలు కొట్టుకుపోతున్నాయి. ఆ చీమల్ని ఒడ్డుకు
తీసి కాపాడాడు చిన్నోడు. అప్పుడాచీమలు "ఎప్పుడైనా మాఅవసరమొస్తే అప్పుడు మమ్మల్ని తలుచుకో మేము వచ్చి సాయం
చేస్తాము" అని చెప్పాయి.
చిన్నోడు
ఎలుగుబంటి ఒండ చేరుకొని ఎలుగుబంటితో
"మా అన్నల్ని,అప్పను ఎక్కడ దాచావో చెప్పు?
మర్యాదగా వాళ్ళని అప్పగించావా సరే లేకపోతే నిన్ను
చంపెస్తాను"అని బళ్ళెం ఎక్కుపెట్టాడు.
"సర్లే గాని నేను ఏటికెళ్ళి
తానం పోసుకొని వచ్చీసరికి ఈసోలూ, నూకలూ వేరుచేసీయాల అలా
చేస్తే నన్ను చంపి మీవాళ్ళని
తీసుకుపోదువు గాని, లేకపోతేనిన్ను మింగెస్తాను"అంది. "పందెం అంటే పందెం'
అని ఏటికి వెళ్ళీపోయింది. అప్పుడు
చీమలు గుర్తుకొచ్చాయి. వెంటనే తలచుకోగా గింజకొక్క చీమ వచ్చి అన్నింతినీ
వేరు చేస్సాయి. కొంతసేపటికి ఎలుగుబంటి వచ్చి చూసి, పందెం
లో ఓడిపోయినట్లు ఒప్పుకొని లొంగిపోయింది. అన్నలనీ అక్కను విడిపించి ఎలుగు బంటితో "ఇకనైనా
భుద్ధిగా బతుకు "అని చెప్పి ఇంటికి
తీసుకుపోయి అందరూ హాయిగా ఉన్నారట.
No comments:
Post a Comment