Thursday 25 October 2012


 చెమర్తకారి

ఒకరోజు భోజరాజు, కాళిదాసు మారువేషాలలో రాజ్య పర్యటనకి వెలుతున్నారు. ఒక గ్రామంలో ఉదయాన్నే ఒక

ఇల్లాలు కల్లాపి చల్లుతూ ఉంది. ఇంతలో దగ్గరలోని ఒక చెట్టుపై కాకి "కావ్ కావ్" మని అరిచింది. అంతే కల్లాపి పాత్ర

అక్కడే పడేసి,తన మొగుడ్ని వాటేసుకొని "ఓరి నా మొగుడో..." అంటూ భయపడి,వణికిపోతూ అతన్ని

వాటేసుకుందట.

    ఆ సన్నివేశాన్ని చూసిన భోజుడు కాళిదాసుతో "నారాజ్యం లో ఇంత పిరికివారు ఉంటారా"అన్నాడట. అప్పుడు

కాళిదాసు "పట్టపగలు కాకి అరిస్తే భయపడే ఆడది అర్ధరాత్రి కావేరీ నదిని అవలీలగా దాటిపోతుందట" అని అన్నాడు.

కావేరీ నదిలో భయంకరమైన మొసళ్ళు ఉంటాయి. పగలే యెవ్వరూ దాటలేరు.

    కాళిదాసు చెప్పాడంటే నమ్మవలసిందే... అని గూఢచారులను నియమించి ఆమెను ఒక కంట

కనిపెట్టమన్నాడట.

   ఆమె తన ఇంటికి వచ్చిన కుక్కలను తలుపులేసి చంపి వాటి మాంసాన్ని ఒక బుట్టలో పెట్టి మొగుడుకి రాత్రి

భోజనం లో నల్లమందు కలిపి పడుకోబెట్టి అర్ధరాత్రి ఆ బుట్టను మోసుకుంటు కావేరీ నది దాటుతూ తనను

తినబోవడానికి వచ్చే మొసళ్ళకు ఈ మాంస ఖండాలను విసురుతూ కావేరీ నదిని అవలీలగా దాటిపోయి ఆవలి

తీరాన వున్న తన ప్రియుని రోజూ కలుసుకుంటుందట.

No comments:

Post a Comment