Thursday 4 October 2012

సేకరణ: //మురళీ//*** శ్రీకాకుళం జానపద సాహిత్యం***తే04-10-2012దీ
గ్రంధాలలో దొరకని జానపద సాహిత్యం తరతరాలుగా శృతిస్మృతులుగా పరంపరగా
వస్తున్న జానపద సాహిత్య సంపద యాచకవృత్తి చేసే మాలదాసర్లు,యెరుకలి వాళ్ళు
బుడబుక్కల వాళ్ళు, వొగ్గు కధకులు చెప్పేవాళ్ళూ మొదలైన జానపదులు పాడుకొనే
ఈ గేయాలు నేడు కనుమరుగైపోతూ ఉంటే , ఎక్కడో ఎవరి స్మృతి పదం లోనో మిగిలినవి,
ముఖ్యంగా రామాయణ, భారత ఇతివృత్తాలుగా వున్నవాటిలో కొన్నిమీ ముందుంచుచున్నాను.
***శ్రీరామ జననం***
సిర సాగ్రము పైని -సిద్విలాసుండు
సేసతల్పమూ పైని -పవలించియుండి
అమురులందరితోడా-ఆమునులంతా కూడీ
ఆ రావణూ బాదలకూ- బరియించా లేకా
సీర సంద్రములోన - పడి సావబోగా
అమరులంతా కలిసీ- ఆమునులంతా కలిసీ
ఆదివిష్ణు పాదాలూ- అమరంగా పట్టీ
ఆ విష్ణువావేలా- అబయమొసగేరూ
కరుణించి కమలాచ్చు-కనికరించేరూ
కడుపుణ్యవతియైనా- కౌసల్య గర్భాన
రాముడై జలిమించీ- ఐవోజ్యయందూ
ఆదిశేసువుబుట్టె-లచ్చనామూరితియై
సెంకుసెక్కరాలే-బరత సెత్రికులుగా
అవతారమెత్తేరూ-అవని లోపలనూ
బాలచందురినిలా- దినదినము వుద్దియై
ఆటపాటల తోడ-ఆనందముల తోడ
తల్లిదండ్రులకెల్ల -తనివితీరంగా
కడుబాల్యమందునా- కవుసికిని వెంటా
వనములకె వెళ్ళారూ-విలువిజ్జె నేర్చారూ
మంత్రంబులను నేర్చి- మర్మములను తెలిసి
అకిల విద్దెలనెల్ల- అలవోకగా నేర్చి
యాగమును కాసారూ- రక్కసుల జంపారు
మునులు ఆనందింప- సురలు పువ్వులనొంప

No comments:

Post a Comment